సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కొత్తగూడెం సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌, టీబీజీకేన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, జేఏసీ నేతలు పాల్గోన్నారు.