సిడ్నీ పర్యటనలో శేరి సుభాష్‌ రెడ్డి

సిడ్నీ,ఆగస్ట్‌28: ఆస్టేల్రియా పర్యటనకు బయలుదేరిన శేరి సుభాష్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం సిడ్నీ చేరుకుంది. ది మైనింగ్‌ 2017, ఆసియ పసిఫిక్‌ ఇంటర్నేషనల్‌ ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున శేరి సుభాష్‌ రెడ్డి నేతృత్వం లోని బృందం హాజరుకానుంది. ఈ బృందం సిడ్నీ చేరుకుందని టీఆర్‌ఎస్‌ ఆస్టేల్రియా అధ్యక్షుడు నాగేందర్‌ రెడ్డి కాసర్ల తెలిపారు. 29న మంగళవారం సిడ్నీ లో జరిగే ఆసియ పసిఫిక్‌ ఇంటర్నేషనల్‌ మైనింగ్‌ ప్రదర్శనలో పాల్గొని , 31 న బ్రిస్బేన్‌ లో జరిగే ది మైనింగ్‌ రిసోర్స్‌ కన్వెన్షన్స్‌కు వీరు హాజరవుతారు . 4,5,6న మెల్బోర్న్‌ లో వివిధ మైనింగ్‌ కంపెనీలతో జరిగే సమ్మిట్‌లో పాల్గొని మైనింగ్‌ తవ్వకాలు ,సాంకేతిక నైపుణ్యత , మార్కెటింగ్‌, పర్యావరణ పరిరక్షణ , వివిధ నూతన శాస్త్రియ పద్దతుల పై చర్చించి , మన రాష్ట్రం లో ఇక్కడి పద్ధతులు అమలుచేయడానికి ఉన్న అంశాల పై శేరి సుభాష్‌ రెడ్డి బృందం చర్చించనుందని అధ్యక్షుడు నాగేందర్‌ రెడ్డి కాసర్ల తెలిపారు