సిపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలి

టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవిచంద్ర

జనం సాక్షి,చెన్నారావుపేట

మండల కేంద్రంలో నిర్వహించబడిన టీఎస్సీపీఎస్ఈయూ అత్యవసర సమావేశంలో హాజరైన రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు రవిచంద్ర గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల లోపే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బానోత్ వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వ వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగుల పక్షపాతి అన్న పేరును కేసీఆర్ నిలబెట్టుకోవాలని కోరడం జరిగింది.మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి దేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలవాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జరుపల రమేష్, పావని, రమాదేవి,తగరం యాకయ్య తదితరులు పాల్గొన్నారు.