సిరియా బాలుడి సైకతశిల్పం

sktakcg0ప్రపంచం మొత్తాన్ని కంటతడి పెట్టించిన సిరియా బాలుడి మృతిపై సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పూరి బీచ్‌ లో తన బాధనంతా సైకత శిల్పం రూపంలో ఏర్పాటు చేశారు. సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన బాలుడి మృతదేహాన్ని.. ఇసుకలో ఏర్పాటు చేశారు. మానవత్వం మంటగలిసి పోతుంది. సిగ్గు, సిగ్గు అనే కోటేషన్స్ పెట్టారు. ఇకనైనా ఉగ్రవాదులు మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సైకత శిల్పాన్ని చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు.