సీఈసీ కమిషనర్‌ గా సునీల్‌ ఆరోరా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ గా మాజీ ఐఏఎస్‌ అధికారి సునీల్‌ ఆరోరా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను కేంద్రం నియమించింది. శుక్రవారం ఆయన ఎన్నికల సంఘం కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించారు. జులై నెలలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నజీం జైదీ పదవీ విరమణ పొందిన తర్వాత కమిషనర్‌ గా కొనసాగుతున్న అచల్‌ కుమార్‌ జోతి సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో సునీల్‌ ఆరోరాను కేంద్రం నియమించింది.