సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

కమాన్ పూర్, జనంసాక్షి , అక్టోబర్ 07 : పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన గన్నేవరపు సమ్మయ్య కు ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన రూ, 1, 25,000 ల విలువ గల చెక్కును శనివారం బీ. ఆర్. ఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. సమ్మయ్య అనారోగ్యంతో ప్రయివేటు హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని, ముఖ్యమంత్రి సహాయనిది నుండి ఆర్థిక సహాయం కోసం జడ్పి చైర్మన్ పుట్ట మధు సిపారసు తో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు బాధితుడు సమ్మయ్యకు రూ, లక్ష 25 వేల విలువ గల మంజూరైన చెక్కు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా సమ్మయ్య సీ. ఎం కే. సీ. ఆర్ కు, జడ్పి చైర్మన్ పుట్ట మధుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
బీ. ఆర్. ఎస్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, వైస్ ఎంపిపి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, పి. ఏ. సీ. ఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, బీ. ఆర్. ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొయ్యడ రవి, మాజీ పి. ఏ. సీ. ఎస్ చైర్మన్ బాద్రపు మల్లేష్, నాయకులు కమ్మగోని భాస్కర్, ఊరడీ శ్రీను, కొండి అనిల్, గన్నేవరపు కొమురయ్య, గన్నేవరపు కనకయ్య, జంగిలి రాములు, చంద్రయ్య, కొయ్యడ రవి, కుమార్, కొండి సంపత్, కూషణ కనకయ్య, కటకం శ్రీను,కొండి రవి, ఆడెపు రాయమల్లు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.