సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

పానుగల్, సెప్టెంబర్ 18( జనం సాక్షి )
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆదివారం రోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లా గిరిజన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మూడవత్ చంద్రు నాయక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రు నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా విద్యా,ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమనాథ్ నాయక్, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్,బాబు నాయక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు