సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను కాల్చి చంపిన దుండగులు

బెంగళూరు,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): ప్రముఖ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను కాల్చి చంపారు.బెంగళూరు సిటీ రాజరాజేశ్వరి నగర్‌లో గౌరీ నివసిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో లోపలికి చొరబడ్డ దుండగులు తుపాకితో ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయిన గౌరీని చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.గౌరీ లంకేశ్‌ హత్యపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని, దేశంలో మారుతున్న పరిస్థితులకు ప్రమాద ఘంటిక అని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.