సీబీఐ దర్యాప్తు చేయించాలి: సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌

కోల్‌కతా, జనంసాక్షి:  తీవ్రగాయాలతో పోలీసుల కష్టడీలో కన్నుమూసిన తమ కుమారుడి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఫ్‌ఐ నేతలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోగా అదే రోజు సాయంత్రం గుప్తా మరణించారు. గుప్తా మరణాన్ని దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్న మమతా బెనర్జీ దర్యాప్తు విషయమై ఏమీ మాట్లాడలేదు. మరోపక్క వామపక్షలు బంద్‌కు పిలుపునిచ్చే ఆలోచనలో ఉన్నారు.