సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు

11ఢిల్లీ: ఢిల్లీ సచివాలయంపై సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రతి అంశంలో ప్రధాని మోడీని విమర్శించటం కేజ్రీవాల్ కు ఫ్యాషన్‌ గా మారిందని ఆయన ఫైరయ్యారు. సీబీఐ స్వయంప్రతి కలిగిన సంస్థ అని ఆయన చెప్పారు. సీబీఐ ఏం చేస్తుందో ప్రభుత్వానికి చెప్పి చేయదని గుర్తుచేశారు.