సీబీఐ విచారణకు మరోసారి హాజరైన కార్తీ

న్యూఢిల్లీ,ఆగస్టు28 : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ సోమవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి వచ్చిన కార్తీని సీబీఐ అధికారులు దాదాపు 100కి పైగా ప్రశ్నలను కార్తీపై సంధించారు. ఈనెల 23న విచారణ సందర్భంగా కార్తీని సీబీఐ ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈనెల 18న సుప్రీం కోర్టు కార్తీ చిదంబరాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో సుప్రీం ఉత్తర్వులకు అనుగుణంగా మరో నలుగురిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ముంబైకి చెందిన ఐఎన్‌ఎక్స్‌ విూడియాలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ లభించేలా వ్యవహరించినందుకు కార్తీకి రూ 3.5 కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఆయనపై నేరపూరిత కుట్ర, మోసం, అక్రమ పద్దతుల్లో డబ్బులు స్వీకరించారనే అభియోగాలపై గత మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.