సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ వెన్న రవీందర్ రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 1 (జనం సాక్షి): గరిడేపల్లి మండలం పరిధిలోని  కోదండరామపురం గ్రామంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మంజూరు చేసిన యస్డీఎఫ్ యన్ఆర్జీయస్ నిధులు 25 లక్షల రూపాయల సిసి రోడ్లు డ్రైనేజీ లను  గ్రామ సర్పంచ్ వెన్న రవీందర్ రెడ్డి ఉపసర్పంచ్ మచ్చరమేష్ తో కలిసి సోమవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ గర్ శాసనసభ్యులుగా శానంపూడి సైదిరెడ్డి  గెలిచిన తర్వాత ప్రతి గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే సైదిరెడ్డి  ప్రత్యేక చొరవతో హుజూర్ నగర్  నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు అధిక నిధులు తీసుకువచ్చి గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి వినోద్  కుమార్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.