సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

వేమనపల్లి,అక్టోబర్ 07,(జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని వేమనపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోలి వేణుమాధవరావు అన్నారు.ఈ సందర్భంగా మండలంలోని బుయ్యారం,సూరారం, చామనపల్లి గ్రామపంచాయతీలలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ.35 లక్షల డి ఎం ఎఫ్ టి,ఎస్ డి ఎఫ్ నిధులతో అంతర్గత సిమెంటు రోడ్లు,సైడు కాల్వలు,గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బద్దంపల్లి గ్రామ యువకులకు క్రీడ సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు పల్లె రమేష్ గౌడ్, శ్రీనివాస్,జెల్ల మొండి,ఉప సర్పంచ్ మహేష్ రెడ్డి,
వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడే మధుకర్,నాయకులు పర్వతాలు, పోచగౌడ్,సత్తన్న,కిరణ్ గౌడ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.