సుప్రీంకోర్టుకు బెదిరింపు లేఖ

v7i9tlq7సుప్రీం కోర్టుకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. కోర్టును పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్ పంపించారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యాకూబ్‌ మెమన్ ఉరిశిక్ష నేపధ్యంలోనే ఈ బెదిరింపు మెయిల్ వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మెమన్ కు శిక్ష ఖరారు చేసిన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు కూడా ఆగస్ట్ మొదటి వారంలో బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయనతో పాటూ మెమన్ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు భద్రతను పెంచారు. కోర్టు పరిసర ప్రాంతాల్లోకి ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.