సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంజయ్‌దత్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: జైలు శిక్ష అనుభవించడానికి గాను న్యాయస్థానం ముందు లొంగిపోయే గడువు పెంచాలని కోరుతూ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1993 ముంబయి దాడుల కేసులో ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు ఐదేళ్ల కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు మార్చి 21న ఆదేశాలు జారీ చేసింది.