సురేష్‌ ప్రభుతో మంత్రి కేటీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్‌ ప్రభును మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఐటీ, ఎన్‌ ఆర్‌ ఐ, మున్సిపల్‌ శాఖ ల మంత్రి కె. తారకరామ రావు.నూతనంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు గురువారం ఢిల్లీలోని ఉద్యోగ్‌ భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర మంత్రి కి మంత్రి కె.తారక రామరావు వివరించారు. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామి గా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రం చేస్తోన్న కృషికి తోడుగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మరింత సహకారం, చేయూత నివ్వాలని మంత్రి కె.తారక రామ రావు కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు ను కోరారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్‌ ప్రభును కలిసిన సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామ రావు తో పాటు, తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ పాల్గొన్నారు.