సుష్మాకు కిడ్నీ ఇస్తానన్న పోలీస్
కిడ్నీ ఫెయిలై ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు కిడ్నీ ఇచ్చేందుకు ఓ యువకుడు ముందుకొచ్చాడు. మధ్యప్రదేశ్ భోపాల్లో ట్రాఫిక్ పోలీస్గా పనిచేస్తున్న గౌరవ్ డాంగి సుష్మకు కిడ్నీ ఇస్తానని వెల్లడించాడు. తన బ్లడ్ గ్రూప్ కూడా సుష్మతో సరిపోలిందన్నాడు. సుష్మ గొప్పనాయకురాలన్న గౌరవ్ ఆమె కలకాలం పూర్తి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించాడు.