సూపర్ వ్యూమా హెలికాప్టర్లో రాజ్నాథ్
న్యూఢిల్లీ,నవంబరు19(జనం సాక్షి): రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. సూపర్ ప్యూమా హెలికాప్టర్లో విహరించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ గగనయానం చేశారు. సింగపూర్ వైమానిక దళానికి చెందిన సూపర్ ప్యూమా హెలికాప్టర్లో రాజ్నాథ్ సొర్టీ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆయన సెంబవాంగ్ ఎయిర్బేస్ను విజిట్ చేశారు. సియాచిన్లో హిమపాతం వల్ల భారత సైనికులు మృతిచెందిన ఘటన పట్ల రాజ్నాథ్ సవిూక్షించారు. మృతిచెందిన కుటుంబసభ్యులకు ఆయన నివాళి అర్పించారు.