సైకో కోసం కొనసాగుతున్న గాలింపు

విజయవాడ:పోలీసులకు చిక్కినట్టే చిక్కి పారిపోయిన సైకో రాచకుంట సాంబశివరావు కోసం రెండోరోజూ గాలింపు చర్యలు కొనసాగుతాన్నాయి.కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకోకుండా ఆరు చెక్‌పొస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు,సైకోను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు.గుంటూరు,నెలూరు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లో పలు దొంగతనాలు,దాడులకు పాల్పడుతూ గత ఐదు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న సాంబశివరావును పోలీసులు బుధవారం పట్టుకున్నారు.అయితే దోచుకున్న బంగారం దాచిపెట్టిన చోటు చూపిస్తానని గురువారం పోలీసులను గుంటూరు నుంచి విజయవాడకు తీసుకువెళ్లి కొండపల్లి ఖిల్లాపై ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లాక పోలీసుల కన్నుగప్పి పారిపోచయాడు.