సోనియాతో భేటీకానున్న మాజీపీసీసీ చీఫ్ డీఎస్
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయలు, కళంకిత మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారుతున్నరన్న అంశం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం హస్తిన వెళ్లిన డీఎస్ అధిష్టాన పెద్దలతో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా రాష్ట్ర రాజకీయాలపై అధిష్టాన పెద్దలతో చర్చిస్తున్నారు.