సోనియా ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశరాజధాని అట్టుడుకుతుంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సోనియాగాంధీ ఇంటిని ముట్టడించేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. బారికేడ్లను తొలగించి షిండే ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.