సోమాలియాలో బాంబు దాడి..189 మంది మృతి

సోమాలియా: సోమాలియా లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు మొగదిషు పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రక్ బాంబుతో వరుస పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 189 మంది మృతి చెందగా..200 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. నిత్యం రద్దీగా ఉండే కీ మినీస్ట్రీస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ట్రక్ బాంబుతో దాడులకు ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.