సోమ్‌నాథ్‌ వెంటనే లొంగిపో!

గృహ హింస కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి అజ్ఞాతంలోకి వెల్లడంపై.. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అసహనం వ్యక్తంచేశారు. సోమ్ నాథ్ వెంటనే లొంగిపోవాలని, ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చిందని ట్విట్టర్లో ప్రశ్నించారు. సోమ్ నాథ్ తీరు పార్టీని, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేదిగా ఉందని పేర్కొన్నారు. ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతిపై ఆయన భార్య గృహ హింస, హత్యాయత్నం కేసులు పెట్టారు. దీంతో సోమ్ నాథ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో సోమ్ నాథ్ అజ్ఞాతంలోకి వెళ్లగా. కేజ్రివాల్ ఆయన వైఖరిని తప్పుపట్టారు.