సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో బండి శ్రీనివాస్ ఎంపిక

 

హిస్టరీ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన బండి శ్రీనివాస్

కొత్తగూడ ఆగస్టు 31 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంచగూడ గ్రామానికి చెందిన ఓయూ అధ్యాపకులు బండి శ్రీనివాస్ అరుదైన ఘనతను సాధించారు.తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ లో ఉన్న జీటీఎన్ ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 26,27,28 సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 41వ వార్షిక సదస్సును నిర్వహించారు.ఈ సౌత్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ పాలక మండలి(ఈసీ)సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఓయూ చరిత్ర అధ్యాపకులు బండి శ్రీనివాస్ కు ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది.ఈ ఘనతను సాధించిన శ్రీనివాసును కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.