స్కూలు బస్సు ఢీ కొని బాలుడి మృతి

ఆత్మకూర్‌,(జనంసాక్షి): ప్రైవేటు స్కూల్‌బస్సు ఢీకొని పసి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిదిలోని అమరిచింతలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం అమరచింత సవరమ్మ గుడి సమీపంలో జరిగిన ఈ ఘటనా వివారాల్లోకి వెలితే అమరచింత ఎస్సీ కాలనీకి చెందిన శ్రీహరి, లక్ష్మిల మూడో కుమారుడు అంబరీష్‌(03) ఆద్మకూర్‌లోని ఒక స్కూలు బస్సు ఢీకొని మృతి చెందాడు. శ్రీహరి ఇద్దరి కుమారులు అనవింద్‌, అలోక్‌నాథ్‌లు అదే పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాల ముగించుకొని వస్తున్న వీరి కోసం తండ్రి శ్రీహరి తన మూడేళ్ల కొడుకైన అంబరీష్‌ను వెంటబెట్టుకొని బస్‌స్టాప్‌ వద్దకు వచ్చాడు. బస్సలో నుండి ఇద్దరు పిల్లల్ని తీసుకొని, బస్సుముందకు కదిలే క్రమంలో వెంటవచ్చిన అంబరీష్‌ బస్సుక్రిందపడి ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటీన కారులో ఎస్వీయస్‌ ఆసుపత్రికి తరలించారు. ఎస్వీయస్‌ వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్దారించారు.