స్కూల్లో చిన్నారి దారుణహత్య
టాయ్లె/-ట్లో మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ,సెప్టెంబర్8(జనంసాక్షి): దేశ రాజధాని సవిూపంలోని గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలోని టాయిలెట్లో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతదేహం లభించింది. రక్తపుమడుగులో ఆ విద్యార్థి మృతదేహం పడి ఉంది. ఈ దారుణ ఘటన స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చోటుచేసుకుంది. ఎవరో బాలుడిని గొంతుకోసం చంపినట్లు గుర్తించారు. ఉదయం 8 గంటలకు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని టాయిలెట్లో తోటి విద్యార్థి గుర్తించి పాఠశాల సిబ్బందికి తెలియజేశాడు. బాలుడి గొంతు కత్తితో నరికి ఉంది. మృతదేహం పక్కనే కత్తి కూడా లభించింది. /రిళిలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో స్కూల్లో కలకలం రేగింది. విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎవరో దారుణంగా హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గత ఏడాది ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వసంత్కుంజ్ బ్రాంచ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 6 ఏళ్ల విద్యార్థి మృతదేహం వాటర్ ట్యాంక్లో లభించింది.