స్థానిక ఎన్నికల్లో పట్టంకట్టండి

` మెజారిటీ స్థానాలను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతోంది : హరీశ్‌
సిద్దిపేట(జనంసాక్షి):స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరగినా బిఆర్‌ఎస్‌దే విజయమని అన్నారు. కాంగ్రెస్‌ 20 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. స్థానిక ఎన్నికలపై ఈ మధ్య సర్వే చేయిస్తే.. తెలంగాణలో మొత్తం 31 జిల్లా పరిషత్‌లు ఉంటే.. 16 నుంచి 18 స్థానాలని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతోందని ఆ సర్వేలో తేలిందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడిరచాలని పిలుపునిచ్చారు. సోమవారం ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని బీఆర్‌ఎస్‌ శ్రేణులకి దిశానిర్దేశర చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు విూడియాతో మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ గజ్వేల్‌ అని ఉద్ఘాటించారు.32 రేవంత్‌ ప్రభుత్వం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు ఎరువులకు లైన్‌లో నిలబడ్డ దాఖలాలు లేవని.. రేవంత్‌ ప్రభుత్వంలో ఇప్పుడు ఎకరానికి ఒకటే బ్యాగ్‌ అంటున్నారని… మళ్లీ లైన్లలో నిలబడే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అందరూ రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్‌ హయాంలో మోటార్లు కాలకపోయేవని.. ఇప్పుడు మోటార్‌ వెండిరగ్‌ దుకాణాలకు గిరాకీ పెరిగిందని విమర్శించారు. ఆనాడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు భూమి కొనవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్‌ పాలనలో తెలంగాణలో రెండు ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో ఒక ఎకరం కొనే పరిస్థితి వచ్చిందని మాజీమంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, స్థానిక ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పబోతున్నారని అన్నారు. ప్రజలు బిఆర్‌ఎస్‌ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు.