స్పెక్ట్రమ్‌ మంత్రుల బృందం నేడు భేటీ

న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్‌ కేటాయింపుల పై నియమించిన మంత్రుల అధికారిక బృందం నేడు భేటీ కానుంది. సౌత్‌ బ్లాక్‌లోని కేంద్ర రక్షణశాఖ మంత్రి అంటోని కార్యలయంలో జరిగే ఈ భేటీకి హోంమంత్రి చిదంబరం నేతృత్వం వహించనున్నారు. స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధిచిన అంశాలపై మంత్రుల బృందం చర్చించనుంది. బృందంలోని ఏడుగురు మంత్రులు  భేటీకి హాజరుకానున్నారు. ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో మంత్రుల భేటీ చివరి సారిగా జూన్‌5న జరిగింది. అయితే ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగి చైర్మెన్‌ పదవికి  రాజీనామా చేశారు. అనంతరం శరద్‌పవర్‌ ఆ పదవి చేపట్టాడానికి నిరకరించడంతో చిదంబరం నేతృత్వంలోని మంత్రుల బృందం నేడు భేటీ కానుంది