స్వచ్ఛభారత్‌ కార్యక్రమంతో  బిజెపి ప్రచారం

శ్రీకాకుళం,మార్చి26(జ‌నంసాక్షి): శ్రీకాకుళంలో బిజెపి అభ్యర్థులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వెంకటేశ్వర రావు, బిజెపి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పేర్ల సాంబమూర్తిల అధ్వర్యంలో జిల్లా పరిషత్‌ ఎదురుగా ఉన్న హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా హౌసింగ్‌ బోర్డు కాలనీలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ల సాంబమూర్తి మాట్లాడుతూ.. బిజెపిని గెలిపించాలని కోరారు. చల్లా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… దేశంలోని చెత్తను తొలగించడానికి మోడి స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించారన్నారు. ఈ ప్రచారంలో సవ్వాన ఉమామహేశ్వరి, అట్టాడ రవిబాబ్జి, సంపతిరావు రమణ మూర్తి, కోరాడ నారాయణ రావు, దయాసాగర్‌, సవ్వాన వెంకటేశ్వర రావు, దొంతం చంద్రశేఖర రావు, విస్తారక్‌ ఠాగూర్‌, తాల్లూరు విజయలక్ష్మణ్‌, ఆరంగి తిరుపతి రావు, మజ్జి వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు.