స్వదేశానికి చేరుకున్న గీత
న్యూఢిల్లీ: 15ఏళ్ల క్రితం తప్పిపోయి రైలులో లాహోర్కు వెళ్లిన గీత సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి చేరుకుంది. ఈదీ పౌండేషన్ సభ్యులతో కలిసి కరాచీ నుంచి ఢిల్లీ చేరుకున్న గీతకు ఎయిర్పోర్టులో అధికారులు, కుటుంబసభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
బీహార్కు చెందిన తల్లిదండ్రులను ఫొటో ఆధారంగా గుర్తించిన గీతకు డీఎన్ఏ పరీక్షల తర్వాత కుటుంబసభ్యులకు అధికారులకు అప్పగించనున్నారు. డీఎన్ఏ ఫలితాలు వ్యతిరేకంగా వస్తే గీత ఢిల్లీ, ఇండోర్లోని 2 సంస్థల్లో ఉండేందుకు ఏర్పాట్లను చేశారు