స్వల్పంగా తగ్గిన పసిడి ధర

న్యూదిల్లీ: ప్రపంచ మార్కెట్ల ప్రభావం, వ్యాపారస్తుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ. 100 తగ్గడంతో పదిగ్రాముల పసిడి ధర రూ. 28,750కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,205.90 డాలర్లుగా ఉంది.మరో వైపు వెండి ధర మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో వెండి ధర యథాతథంగా రూ. 37,100 వద్ద ఉంది.