స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

psue1fviముంబై : నిన్న భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. రిలయన్స్‌, బజాజ్‌ ఆటో, మారుతి షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఐటీ షేర్లు పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 302 పాయింట్లు లాభపడి 25,785 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అయింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,821 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అయింది. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 25,227లుగా ఉంది. కిలో వెండి రూ. 33,763లుగా ఉంది. డాలర్‌ మారకం విలువ రూ. 66.16లుగా ఉంది.