స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

iwjuq8h1హైదరాబాద్‌: బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. రూ.15 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,690కు చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కొంతవరకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ.25 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.34,300కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు మందగించడంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.