స్వార్థం లేని కార్యకర్తల పార్టీ బిజెపి

వేములవాడ గ్రామీణం, అక్టోబర్ 13 (జనంసాక్షి): దేశ ప్రజలు, దేశ ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇచ్చే స్వార్థం లేని కార్యకర్తలు ఉన్న పార్టీ బిజెపి అని వేములవాడ గ్రామీణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండల పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో బిజెపి పటిష్టంగా ఉందని, స్వార్థ ప్రయోజనాల కోసం తల్లిలాంటి పార్టీని వీడిన వారిని పట్టించుకోదన్నారు. పార్టీ బూతు స్థాయిలో పటిష్టంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు గురుపల్లి పరమేష్, శెట్టిపల్లి రవి కిషోర్, మండల ఉపాధ్యక్షులు అనిల్, నాయకులు దానే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.