స్విట్జర్లాండ్కు వెళ్లిన వై.ఎస్. జగన్
– 27న తిరిగి హైదరాబాద్కు రాక
హైదరాబాద్, ఏప్రిల్22(జనంసాక్షి) : దాదాపు 15 రోజుల పాటూ నామినేషన్లు, ప్రచారం, పోలింగ్లతో బిజీ, బిజీగా గడిపిన నేతలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. టెన్షన్లన్నీ మర్చిపోయి ఫ్యామిలీతో జాలీగా గడిపేస్తున్నారు. కొందరు వేసవి విడిది కోసం విదేశాలకు వెళుతుంటే.. మరికొందరు చుట్టు పక్కల రాష్టాల్లోన్రే ట్రిప్ వేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ వేసవి విడిది కోసం విదేశాలకు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ ఫ్లైటెక్కారు. ఐదురోజుల పాట స్విస్లోనే టూర్లో గడపనున్నారు. వై.ఎస్. జగన్ ఈ నెల 27న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కోర్టు అనుమతితో ఆయన స్విస్ పర్యటనకు వెళుతున్నారు. జగన్ గతేడాది కూడా వేసవి విడిది కోసం కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ టూర్కు వెళ్లారు.