హత్యలకు నిరసనగా బెంగాలీల ఆందోళన

గౌహతి,నవంబర్‌3(జ‌నంసాక్షి): అసోంలో ఐదుగురు యువకుల హత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యలకు నిరసనగా బెంగాలీ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టిన్సుకియా జిల్లాతో పాటు గువహటిలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలాఉంటే హత్యాకాండను ఎన్‌ఆర్‌సీకి లింక్‌ చేస్తున్నారు టీఎంసీ నేతలు అసోం పౌరులను దేశం నుంచి వెళ్లగొడుతున్న నేపథ్యంలోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా బెంగాలీలు ఆందోళనకు దిగారు.