హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

ఏలూరు,జూలై22 (జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరావు పాలకొల్లు శంబునిపేట్‌ లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌ లో సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ముత్యాలరావు పాత్రికేయులతో మాట్లాడుతూ.. నేటి మెనూ ప్రకారం.. పెట్టవలసిన కిచిడి తినటానికి తాను వచ్చానని, హాస్టల్‌ లో ఉన్న 30 మందికి వండిన కిచిడి సరిపోకపోవడంతో.. పిల్లలకు సరిపెట్టారని, దీంతో తాను కిచిడి తినలేకపోయానని చెప్పారు. కిచిడి అన్నంలానే ఉందని ఆరోపించారు. దీనిపై సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ తో తను ఫోన్లో మాట్లాడానని, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని ముత్యాలరావు తెలిపారు.