హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత

విజయవాడ,జూలై23(జనంసాక్షి): కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఏడుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినిలు బాధపడుతున్నారు. వెంటనే విద్యార్థినులను వసతి గృహం సిబ్బంది చల్లపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. రాత్రి తిన్న ఆహారం కారణంగానే విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు భావిస్తున్నారు. విద్యార్థినిలను సంక్షేమ అధికారి సాల్మన్‌ రాజు పరామర్శించారు.