హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

రుద్రంగి సెప్టెంబర్ 8 (జనం సాక్షి)
రుద్రంగి ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు ఆర్ బి ఎస్ కె వైద్యాధికారి ప్రభాకర్ గురువారం వైద్య పరీక్షలు చేశారు.రాష్ట్రంలో ఇటీవల సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ కాగా గురువారం  విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు.ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి రవీంద్ర స్వామి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.