హిందూ అమ్మాయితో స్నేహం చేసాడని యువకుడిపై హిందుత్వవాదుల దాడి

1

కర్నాటక ఆగస్ట్‌25(జనంసాక్షి):

ప్రజాస్వామ్య దేశంలో… స్వేచ్ఛా స్వాతంత్య్రం… పౌరుల ప్రాథమిక హక్కు. దేశంలో ఎక్కడైనా తిరిగే, నివశించే హక్కుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛ అందరి సొంతం. అలాంటి హక్కును అక్కడ కాలరాస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం రోజున యువతీ యువకులకు పెళ్లిల్లు చేసి సంచలనం రేపిన హిందుత్వ వాదులు… కర్నాటకలో మరోసారి రెచ్చిపోయారు. హిందుత్వ వాదులు రెచ్చిపోయారు. హిందూ అమ్మాయితో తిరుగుతున్నాడనే నెపంతో.. ఓ ముస్లిం యువకుడికి దేహశుద్ధి చేశారు. అంతా చూస్తుండగా… ఎడాపెడా కొట్టి… గంటసేపు స్తంభానికి కట్టివేశారు.కర్నాటకలోని మంగళూరులో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ముస్లిం యువకుడు స్థానికంగా వున్న… ఓ సూపర్‌ మార్కెట్‌లో మేనేజర్‌. హిందూ అమ్మాయి అందులోనే పని చేస్తోంది. అత్యవసరంగా 2వేల రూపాయలు కావాలని అమ్మాయి కోరగా… ఇద్దరూ కలిసి.. అత్తావర్‌ సవిూపంలోని బాబుగుడ్డే ప్రాంతంలోని ఏటీఎంకు వెళ్లారు. అక్కడ డబ్బులు తీసుకుంటుండగా… హిందూత్వ సంస్థలకు చెందిన వారిగా భావిస్తోన్న కొందరు అక్కడికి చేరుకొని… ముస్లిం యువకుడిని చితకబాదారు. ముస్లిం యువకుడికి అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి. వచ్చిన వారు ఎవరో? ఎందుకు దాడి చేస్తున్నారో? అందుబట్టలేదు. ఇంత జరుగుతుంటే… హిందూ అమ్మాయి మాత్రం మాటైనా మాట్లాడలేదు.ముస్లిం యువకుడిని దాడిచేస్తోన్న దశ్యాలు… విూడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. వాటిని చూసి స్థానిక పోలీసులు అలర్ట్‌ అయ్యారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని… 13 మందిని అరెస్ట్‌ చేశారు. భజరంగ్‌దళ్‌ ప్రమేయంతోనే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడి అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం హిందుత్వ శక్తులకు అండగా నిలవటమే నేటి దుస్థితికి కారణమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయని… 2014లో 39… 2013లో 45 కేసులు నమోదైనట్లు గుర్తు చేసింది.