హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు, రాంపూర్‌ జిల్లాల్లో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.5గా నమోదైంది. ప్రజలు భయాందోళనతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.