హిమాచల్లో కాంగ్రెస్ వరాల జల్లు
సిమ్లా,నవంబర్1(ఆర్ఎన్ఎ): హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. మరోసారి తమకు అధికారం ఇస్తే.. రైతులకు లక్షలోపు వడ్డీలేని రుణాలు, 50వేల మంది విద్యార్ధులకు ల్యాప్ లాప్లను అందించడంతో పాటూ లక్షన్నర మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర సీఎం వీరభద్ర సింగ్ హావిూ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన గత ఐదేళ్లలో తాము ఇచ్చిన అన్ని హావిూలను నెరవేర్చామన్నారు. అభివృద్ధిలో హిమాచల్ దూసుకెళ్తోందన్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే తో పాటూ పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రస్తుత సిఎం వీరభద్ర సింగ్ మరోమారు అధికారిక అభ్యర్థి అని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.