హైకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

జనంసాక్షి : న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఐదుగురు అదనపు న్యాయమూర్తులు నియామకినికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. అడవల్లి రాజశేఖర్‌రెడ్డి, పొనుగోటి నవీన్‌రావు, సరసా వెంకటనారాయణ భట్‌, ఆకుల వెంకట శేషసాయి, చల్లా కోదండరాం చౌదరిని అదనపు జడ్జీలుగా రాష్ట్రపతి నియమించారని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.