హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం కళ్లు తెరవాలి

: నారాయణ
అమరావతి,మార్చి3(జనం సాక్షి): ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఎం జగన్‌ శిరసావహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ప్రభుత్వం ఇకనైనా వితండవాదంతో ముందుకుపోకుండా హైకోర్టు తీర్పును స్పూర్తిదాయకంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇంకా కాలయాపన చేయకుండా అమరావతిని అభివృద్ధి చేయాలని అన్నారు. అమరావతి రాజధాని రైతులతో చేసుకున్న అగ్రిమెంట్‌ను తూచ తప్పకుండా అమలు చేయాలని సూచించిన మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం నేత మధు మాట్లాడుతూ ఇకనైనా హైకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి ముగింపు పలికి అమరావతి రాజధానిపై దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. ఏకైక రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.