హైకోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలి

: పురంధేశ్వరి
విజయవాడ,మార్చి3(జనం సాక్షి): అమరావతి రాజధానిపై హైకోర్ట్‌ ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతే రాజధానిగా వేల కోట్ల రూపాయలను కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. తీర్పు ప్రకారం రైతులకు భూములను అభివృద్ధి చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రాజధాని భూములను తాకట్టు పెట్టుకుంటుందని విమర్శించారు. కోర్ట్‌ దానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. రాజధానిని అభివృద్దిచేయకుండా భూములను తనఖా పెట్టడం దారుణమన్నారు. దీనిని బిజెపి సహించదన్నారు.