హైటెక్‌సిటీ రైలు ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌: కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైలు ఓవర్‌ బ్రిడ్జిని కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, రాష్ట్ర మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వంతెనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉండటంతో సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.