హైదరాబాద్లోని అబ్దుల్ కలాం పేరు

న్యూఢిల్లీ : హైదరాబాద్లోని డీఆర్డీవోకు భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది.  గురువారం అబ్దుల్ కలాం 84వ జన్మదినం. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకి ఆయన పేరును రేపు ప్రకటించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. అబ్దుల్ కలాం 1982లో డీఆర్డీవోలో చేరారు. రెండు దశాబ్దాలపాటు ఆయన ఆ సంస్థలో విధులు నిర్వహించారు.