హైదరాబాద్‌ ఉన్న తెలంగాణే కావాలి దేవీప్రసాద్‌

నల్లగొండ, జనవరి 8 (జనంసాక్షి):
తెలంగాణకు ఆర్థిక మండళ్ళు, ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తమకు కావాలని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ అన్నారు. మంగళవారం రాత్రి నట్లగొండలో జరిగిన టీఎస్‌జీవోస్‌ 2013 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ 28 లోగా తెలంగాణ పై తేల్చకుంటే మరో సమ్మెకు ఉద్యోగులంతా సిద్ధమవుతారన్నారు. సకల జనుల సమ్మెను ఉద్యోగులు ఉధృతంగా చేయటం వల్లనే రాజకీయ పార్టీల్లో చలనం వచ్చిందన్నారు. 10వ పీఆర్‌సీని ఈ నెల 30 లోగా ప్రకటించకుంటే ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరంగా చేస్తామని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.