హైదరాబాద్‌ జిల్లాలో 156 పరీక్షా కేంద్రాలు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షకు సర్వం సిద్ధం. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జెసి శ్రీధర్‌ చెప్పారు. 60వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలో 156 మందిని లైజన్‌ అధికారులుగా నియమించామన్నారు. అభ్యర్థుల కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఆర్డీవోలు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష జరగనున్నట్టు చెప్పారు. బ్లూ లేదా బ్లాక్‌ పాయింట్‌ పెన్నులనే వాడాలని సూచించారు.