హైదరాబాద్‌ విలీనంలో సర్ధార్‌ పటేల్‌ పాత్ర అమోఘం : ప్రధాని మోదీ

ఢిల్లీ, సెప్టెంబరు 18 : హైదరాబాద్‌ విలీనంలో సర్ధార్‌ పటేల్‌ పాత్ర అమోఘమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సెప్టెంబరు 17 సందర్భంగా ప్రధాని మోదీ సందేశమిచ్చారు. భారత దేశ సమగ్రతకు కృషి చేసిన వీరులకు వందనాలంటూ ఆయన ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు.